Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

INDvsWI, 2nd T20I..టీమిండియా ఓడినా.. కోహ్లీ, రోహిత్ రికార్డ్

INDvsWI, 2nd T20I..టీమిండియా ఓడినా.. కోహ్లీ, రోహిత్ రికార్డ్
, సోమవారం, 9 డిశెంబరు 2019 (13:21 IST)
ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది. దీంతో భారత్ పరాజయం పాలైంది.
 
టీమిండియా ఓటమిని చవిచూసినా.. భారత క్రికెటర్లు మాత్రం రికార్డుల పంట పండించారు. తిరువనంతపురంలో వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ(2563) ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పొడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 19 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.
 
అలాగే రోహిత్‌ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే వ్యత్యాసంగా ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ, రోహిత్‌లు ఉన్నారు. 
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన రికార్డుని మిస్సయ్యాడు. మరో ఆరు పరుగులు చేసి ఉంటే, స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. ఇప్పటివరకు టీ20ల్లో స్వదేశంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో మార్టిన్‌ గప్తిల్‌ (1430), కోలిన్‌ మన్రో (1000)లు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ సూపర్ క్యాచ్.. ఫీల్డింగ్‌లో చెలరేగిపోయాడు.. (video)